ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

  • ఎం.ఎల్.హెచ్.పీ రాజు కుమార్

నవతెలంగాణ పెద్దవంగర:

మనిషికి ఆరోగ్యానికి మించిన ఆస్తి మరేమీలేదని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వడ్డెకొత్తపల్లి పల్లె దావఖాన ఎం.ఎల్.హెచ్.పీ రాజు కుమార్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ముందస్తుగా కొరిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజాగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, పండ్లు తీసుకోవాలని, బయటి ఆహారాన్ని తీసుకోవద్దని చెప్పారు. ఇంటి పరిసరాలను, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని అన్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ స్వాతి, పంచాయతీ సెక్రెటరీ రజిత, సూపర్వైజర్ అనంతలక్ష్మి, ఏఎన్ఎం బూబా, ఆశా వర్కర్లు పుష్ప, హేమలత తదితరులు పాల్గొన్నారు.

Spread the love