నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి చొరవ చూపాలని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రిని సోమవారం హైదరాబాద్లో కలిసి పీడీఎస్యూ వినతిపత్రాన్ని సమర్పించింది. వర్సిటీల పరిధిలో ఉన్న అన్ని కాలేజీల్లో పీజీ సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని సూచించింది. నిబంధనలను పాటించకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.