పెండెం జగదీశ్వర్ స్మారక పురస్కారాన్ని ప్రముఖ బాల సాహితీవేత్త దార్ల బుజ్జిబాబుకు ఇవ్వనున్నారు. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం ఈ నెల 17న నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల అలుమ్ని హాల్లో ఉదయం 10 గంటలకు సాహితీ మిత్ర మండలి అధ్యక్షులు డా. తండు కృష్ణ కౌండిన్య సభాధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డి, గౌరవ అతిథిగా డా. పత్తిపాక మోహన్ రానున్నారు.