- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరుకు సగటున 90 పైసల చొప్పున ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.
దీంతో నేడు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.89 కి చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.98.96 కు చేరింది. కాగా సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపే ఈ ధరల పెంపుదల, రవాణా రంగంపై అదనపు భారాన్ని మోపనుంది.
- Advertisement -



