మద్దికుంటలో బెల్ట్ షాప్ పై పోలీసుల దాడి

నవతెలంగాణ- రామారెడ్డి :  మండలంలోని మద్దికుంటలో బెల్ట్ షాప్ పై పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన బస్వాపురం  గంగరాజ గౌడ్ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా, అధిక ధరలకు మధ్య అనే విక్రయిస్తున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు, ఇంట్లో తనిఖీలు నిర్వహించగా రూ, 7900 విలువ గల 18 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
Spread the love