విద్యార్థినీలపై పోలీసుల దాడి అమానుషం

– ఐద్వా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నిరసన తెలిపిన విద్యార్థినీలపై పోలీసులు దాడి చేయటం అమానుషమనిఅఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అరుణజ్యోతి, మల్లు లక్ష్మి శువ్రారం ఒక ప్రకటనలో విమర్శించారు. పెద్దపల్లి జిల్లా బాలికల జూనియర్‌ కాలేజీ భవనంలో గ్రంథాలయం ఏర్పాటు కోసం భూమి పూజ చేయొద్దంటూ నిరసన తెలియజేసిన విద్యార్థినీలు, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు. వారిని అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించటమేనని తెలిపారు. మరొక ప్రాంతంలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని విద్యార్థినులందరూ చెప్పినా వినకుండా స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సాక్షిగా ఈ దాడి జరగడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థినీలపై స్టేషన్‌లో విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Spread the love