- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని లెంకలపల్లి గ్రామంలో ఇటీవల ఈఎల్వి భాస్కర్ పౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి యువకులను క్రీడల పరంగా ప్రోత్సహించినందుకు గాను శనివారం ఈఎల్వి భాస్కర్ పౌండేషన్ చైర్మన్ ఈ ఎల్ వి భాస్కర్ లెంకలపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా లెంకలపల్లి ఈ ఎల్ వి టీం సభ్యులు ఆయనను శాలువతో ఘనంగా సన్మానించి జ్ఞాపకం అందజేశారు.ఈ కార్యక్రమంలో మర్రిగూడ ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ఇంచార్జ్ అయితగోని నరసింహ గౌడ్,లెంకలపల్లి ఈ ఎల్ వి టీం సభ్యులు నరేందర్,మానుపాటి సతీష్,పాక కిరణ్, పగిళ్ల అశోక్,అయితగోని శేఖర్,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



