పార్లమెంటులో ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగం

నవతెలంగాణ – హైదరాబాద్: కొత్తగా కొలువుదీరిన లోక్‌సభతో పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే ముర్ముకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ స్వాగతం పలుకుతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 87ప్రకారం లోక్‌సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది.

Spread the love