నేడు వరంగల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ

PM-Narendra-Modiనవతెలంగాణ – హైదరాబాద్
ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్‌లో నేడు పర్యటించనున్నారు. శనివారం ఉదయం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట రానున్న ప్రధాని మోడీ.. అక్కడ్నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 10.15 గంటలకు వరంగల్‌లోని మూమునూర్ ఏరోడ్రోమ్ చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో భద్రకాళీ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారిక కార్యక్రమాలకు ఒక వేదిక.. పార్టీ బహిరంగసభకి మరో వేదిక ఏర్పాటు చేశారు. మోడీకి స్వాగతం పలుకుతూ నగరంలో ఇప్పటికే బీజేపీ నేతలు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. మోడీ రాకను పురస్కరించుకుని వరంగల్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీజీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులతో నాలుగంచెల భద్రత కల్పించారు.

Spread the love