మహబూబాబాద్ లో బీఆర్ఎస్ కు నిరసన సెగ

నవతెలంగాణ మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌(BRS Candidate Shankar Naik)కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమయంలో కంబాలపల్లి గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్ళిన శంకర్ నాయక్‌ను స్థానికులు నిలదీశారు. ‘‘రెండు దఫాలుగా నీకు ఓటు వేసి గెలిపిస్తే తమకు ఏం చేశారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ నాయక్ ఎదుటే జై కాంగ్రెస్ నినాదాలతో గ్రామస్థులు హోరెత్తించారు. దీంతో చేసేదేమీలేక బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ వెనుదిరిగారు.

Spread the love