ముందు దళితుడనని కోర్టులో నిరూపించుకో..

– మాజీ ఎమ్మెలే హన్మంత్ షిండే

నవతెలంగాణ – జుక్కల్
ముందు దళిత జాతీ వాడివని కోర్టులో నిరూపించుకోవాలని జుక్కల్ తాజా మాజీ ఎమ్మెలే  హన్మంత్ షిండే అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతు ప్రస్తుత ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ మరియు మాజీ ఎమ్మెలే హన్మంత్ షిండే మద్య మాటల తుటాలు పేలుతున్నాయి. “తూబడా అంటే మైబడా” అన్నట్టు ఇద్దరి మద్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే విధంగా వ్వవహరం  కొనసాగుతోంది. నోరుంది కదా కస్తా వెనుక ముందు చూసుకోకుండా ప్రయివేట్ బౌన్సర్లను వెంబడి ఉంచుకొని గ్రామాలలో ప్రజలకు బయపడి తిరుగుతున్నావు, దమ్ముంటే బౌన్సర్లు, గన్ మెన్ లు లేకుండా నియేాజక వర్గంలో తిరిగితే అప్పుడు ప్రజలు వెంబడిస్తారని, గ్రామాలలో తరిమి కొడతారని విమర్శించారు. గల్లి రాజకీయ నాయకుడి మాదిరిగా మాట్లాడుకున్నాడని అసమర్థుడని విమర్శించారు. సొంత పార్టీ కార్యకర్తలకు బెండు తీస్తానని, బీఆర్ఎస్ పార్టీల వారికి గోచి ఉడదీసీ ఒక రౌడిలా వ్వవరించడం సబబు కాదని హితవు పలికారు. తాను హైకోర్టులో పిటిషన్ వెసినానని , ప్రజాస్వామ్యం, న్యాయ వ్వవస్థ పైన నమ్మకం,  గౌరవం ఉంటే  దమ్ముంటే నీవు దళితుడవని (ఎస్సీ) నిరుపించుకోవాలని మాటల తుటాల సవాల్ విసిరారు.
Spread the love