పిడిఎస్ బియ్యం పట్టివేత..

నవతెలంగాణ- డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని యెల్లారెడ్డిపల్లి గ్రామ వద్ద అక్రమంగా తరలిస్తున్న 33½ క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం ను పట్టుకొని వాహనంను సీజ్ చేసినట్లు ఆర్మూర్ డివిజన్ పౌరసరఫరాల ఎన్ఫోర్స్ మెంట్ అధికారి వినోద్,ఎ మహేష్ కుమార్ తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం ఇందల్ వాయి మండలంలోని యెల్లరెడ్డి పల్లి గ్రామం నుండి అక్రమంగా ఒక వాహనం లో పిడిఎస్ బియ్యం తరలిస్తున్నరనే విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకుని పోలిస్ స్టేషన్ కు తరలించినట్లు వారు తెలిపారు. ఆర్మూర్ డివిజన్ పౌరసరఫరాల ఎన్ఫోర్స్ మెంట్ అధికారి వినోద్, ఎ మహేష్ కుమార్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని కేసు నమోదు చేసుకుని పట్టుబడిన బియ్యాన్ని ఓక రైస్ మిల్లు కు తరలించినట్లు వివరించారు.
Spread the love