అనారోగ్యంతో రైల్ కింద పడి ఒకరి ఆత్మహత్య..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని రైల్వే గేటు కు కొద్ది దూరంలో రైల్ కింద పడి మేస్త్రి ఆత్మహత్య చేసుకున్నట్లు నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ ఐ సాయి రెడ్డి తెలిపారు. పోలిసులు, మృతుని కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం అంద్రప్రదేశ్ రాష్ట్రం లోని  ప్రకాశం జిల్లా రాయవరం, మార్కాపురం లోని దుర్గమ్మ కాలోని కి చెందిన దేవేండ్ల శ్రీను 43 పని చేసుకోవడానికి ఇందల్ వాయి మండలానికి గత నెలలో వచ్చి మేస్త్రి పనులు చేస్తూ ఉండేవారన్నారు. గత మూడేళ్ల క్రితం హైదరాబాద్ లో బిల్డింగ్ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి తీవ్రగాయాల పాలయ్యాడని, అప్పటినుండి శీను అనారోగ్యంతో ఉండేవాడని వారన్నారు జీవితంపై విరక్తి చెంది గురువారం ఉదయం రైల్వే గేట్ సమీపన రైల్వే కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. మృతి మృతుని వద్ద లభించిన ఆధారాలతో కుమారుడికి సమాచారం అందజేశారు. ప్రస్తుతం మృతుని కుమారుడు కామారెడ్డిలో పండ్లు చేస్తుండగా భార్య పిల్లలు ఆంధ్రలో ఉన్నట్టు వారు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా మారుతికి తరలించినట్లు ఎస్సై సాయి రెడ్డి తెలిపారు.
Spread the love