నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
పెద్దకొడప్ గల్ మండలంలోని జాతీయ రహదారి 161 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలకై పోచారం గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు శాఖ అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట దెగ్లూర్ కు చెందింక్ వెంకటేష్ సంబాజి బన్సుడే (25) వాగ్మరే నిఖిల్ (20) తో పాటు సూర్యవంశీ సోంనాథ్ల్ కలసి మండలంలోని తలాబ్ తాండలో ఇంటి నిర్మాణం స్లాబ్ వేయడానికి ముగ్గురు కలసి దెగ్లూర్ నుండి మోటార్ సైకిల్ పై బయలుదేరారు. జాతీయ రహదారి161 పై పోచారం గేటు వద్ద వీరు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ను హైదరాబాద్ నుండి దెగ్లూర్ వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.మోటర్ సైకిల్ పై ఉన్న మరో వ్యక్తికితీవ్ర గాయాలయ్యాయి దింతో చికిత్స నిమిత్తం బిచ్కుంద ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కొనారెడ్డి తెలిపారు.