పాముకాటుతో మూడు నెలల చిన్నారి మృతి..

నవతెలంగాణ – నిజాంసాగర్

మగపిల్లాడు పుట్టాలని ఆ దంపతులు ముక్కోటి దేవతలకు పూజలు చేశారు వారి పూజలు ఫలించి అనంతరం ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక్క మగపిల్లాడు సంతానం కలిగింది. ఆ సంతోషం మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలింది పాముకాటుతో ఆ చిన్నారి మృతి చెందిన ఘటన నిజం సాగర్ మండలంలోని తుంకిపల్లి తండాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది స్థానికుల కథను ప్రకారం తాండకు చెందిన లక్ష్మీ శంకర్ దంపతులకు అంజలి, వర్షిని, వైష్ణవి, సాయి ధరమ్ తేజ్ (3 నేలలు) సంతానం రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రించారు. అర్ధరాత్రి వేళ చిన్నారి పాలు తాగించేందుకు తల్లి చూడగా నోటి వెంట నూరుగులు కనిపించాయి ఆందోళన చెందిన తల్లి పిల్లాడి చేతి నీ పరిశీలించగా రెండు ఘాట్లు కనిపించాయి అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఒకగానొక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మునిగా విలపించారు ఈ ఘటనతో తాండాలో విషాదఛాయలు ఆలుముకున్నాయి.
Spread the love