మానసిక కుంగుబాటుకు గురై రైలు కింద పడి ఆత్మహత్య..

నవతెలంగాణ – డిచ్ పల్లి
మానసిక కుంగుబాటుకు గురై రైలు కింద పడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన డిచ్ పల్లి రైల్వే స్టేషన్ చోటు చేసుకుంది. రైల్వే పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని మోతే గ్రామానికి చెందిన మంగలి కాశిరాం (35) గత 5 రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళాడని, అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని, మానసిక కుంగుబాటుకు గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంభం సభ్యులు తెలిపారు. మృతుడి వద్ద ఉన్న అదర్ కార్డు ఆధారంగా రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. 50  రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళినా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదన్నారు. భార్య సుమలత ఇద్దరు ఆడ పిల్లలు రుచిత  తేజస్విని, తల్లి సావిత్రి ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించినట్లు తెలిపారు.
Spread the love