రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నవతెలంగాణ – భిక్కనూర్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన సంఘటన మండలంలోని జంగంపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జంగంపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (30) సైకిల్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో కామారెడ్డి నుండి దోమకొండ గ్రామానికి వెళ్ళు తున్న ద్విచక్ర వాహనం సైకిల్ ను ఢీకొనగా సైకిల్ పై ఉన్న వెంకటేష్, ద్విచక్ర వాహనంపై ఉన్న నిఖిల్ (29) అక్కడికక్కడే మరణించారు. వాహనం వెనకాల ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.

Spread the love