‘ఆమె ‘కు ప్రోత్సాహాన్ని అందిస్తేనే మార్చి 8 కి స్వార్ధకత

నవతెలంగాణ – పెద్దవంగర

మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చి, ప్రోత్సాహాన్ని అందిస్తేనే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నిజమైన స్వార్థకత ఉంటుందని బీజేపీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి, వడ్డెకొత్తపల్లి ఎంపీటీసీ సభ్యురాలు సాయిని ఝాన్సీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ‘నవ తెలంగాణ’ తో మాట్లాడారు. మహిళా దినోత్సవం అంటే కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే మహిళలను గౌరవించడం కాదు. మగువ విలువను గుర్తిస్తూ, ప్రతిరోజు స్త్రీని గౌరవించినప్పుడే సమాజం బాగుపడుతుంది. అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో ఆడవాళ్లు పురుషుడితో సమానంగా రాణిస్తుండడంతో పాటుగా, మహిళలు సమాజంలో మరింత మేటిగా నిలుస్తున్నారు. మహిళల సమానత్వం అందరికీ బాధ్యతగా సమాజం గుర్తించి, మనిషిగా చూసే దృక్పథం అలవర్చుకోవాలి. వివక్షపై ఇంట బయట ప్రశ్నించే తత్వం పెరగాలి. ఆయా వ్యవస్థలు, ప్రభుత్వాలు ఆమెకు తగిన ప్రోత్సాహం అందించాలి. అప్పుడే మార్చి 8 కి నిజమైన స్వార్ధకత ఉంటుంది. మహిళా మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Spread the love