అక్రమ మద్యం పట్టివేత..

నవతెలంగాణ – నవీపేట్: మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న 33.5 లీటర్ల మద్యం బాటిల్లను టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. డి పిఈఓ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ సిఐ విలాస్ కుమార్ ఆధ్వర్యంలో నవీపేట్ మండలంలోని నాగేపూర్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో అక్రమంగా 28 మద్యం బాటిల్లలో 33.5 లీటర్ల మద్యాన్ని తరలిస్తున్న బసకొండ మనోజ్, గడ్డం పవన్ లను అరెస్టు చేసి కారును సీజ్ చేసినట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుండి ఒక్క బాటిల్ మందు కూడా తీసుకువస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ దాడులలో ఎక్సైజ్ సిబ్బంది సాగర్ రావు, సలీం, గోపి, కార్తీక్, కిరణ్, నర్సయ్యలు పాల్గొన్నారు.
Spread the love