కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేత

నవతెలంగాణ ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన గౌస్ పాషా కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ముగ్గురు కూతుర్ల తర్వాత ఇర్ఫాన్ 17 సంవత్సరాలు చిన్నవాడు. గత రెండు నెలల కింద అనారోగ్యానికి గురికాగా పలు హాస్పిటల్లో చూపించగా బ్లడ్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది.. లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో క్లాస్ మెంట్ యూత్ తరఫున 30 వేల రూపాయలు, కింగ్స్ యూత్ ఫౌండేషన్ సభ్యులు చికిత్స కోసం రూ.20 వేలు, వైష్ణవి బియ్యం దుకాణం యజమాని గుర్రాల మోహన్ ఐదువేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేసినారు. దాతలు సహాయం చేసి ఆదుకోవాలని ఆ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Spread the love