మహమూద్ పాషాను పరామర్శించిన పీఆర్ టీయూ నాయకులు

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
మండల పరిధిలోని జాకారం గ్రామం ఎంపీపీఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ షేక్ మహమూద్ పాషా గత గురువారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం విదితమే. వైద్య చికిత్సల అనంతరం తన స్వగ్రామం ఇల్లందులో విశ్రాంతి తీసుకుంటున్న మహమూద్ పాషాను శనివారం విషయం తెలుసుకున్న పీర్ టీయూ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.వెంకటేశ్వరరావు, బి. రవిలు వారి ఇంటికి చేరుకుని పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఇల్లందు పట్టణం పీఆర్ టీయూ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, శ్రీనివాసరావు, గుండాల అధ్యక్షుడు వీరాస్వామి ఉన్నారు.
Spread the love