ప్రజా సంక్షేమం  పోచారంతోనే సాద్యం..

నవ తెలంగాణ- నసూరుల్లాబాద్:  సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలందరికీ చేరేలా కృషి చేస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గం లో అభివృద్ధి సంక్షేమం పథకాలు ప్రజలకు చేరాలంటే స్పీకర్కు ఓటు వేసి గెలిపించాలని నస్రుల్లాబాద్ బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ అన్నారు శుక్రవారం మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో ఇంటింటికి బీఆర్‌ఎస్‌ ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఇంటింటికి వెళుతూ అభివృద్ధి సంక్షేమ వివరాలను వెల్లడించారు బాన్సువాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. ఆసరా పెన్షన్ రైతుబంధు ఉచిత కరెంటు కల్యాణ లక్ష్మి పథకాలు ప్రజలకు చేరాలంటే బీఆర్‌ఎస్‌ అత్యధిక మెజార్టీతో గెలవాలన్నారు.గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాల తీరును ఓటర్లకు క్లుప్తంగా వివరించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి స్పీకర్ పోచారం ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటర్లు పట్టం కట్టాలన్నారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో నాయకులు మారుతీ పటేల్, పురం వెంకటరమణ జంగిలి శ్రీనివాస్, రైటర్ గంగాధర్,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love