నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆల్ ఇండియా ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏఐఏసీఈడబ్ల్యూఏ) నూతన అధ్యక్షునిగా తెలంగాణకు చెందిన ఆర్.సుజిత్ గాంధీ నియమితులయ్యారు.ఈ మేరకు శనివారం అసోసియేషన్ సంజీవ్ మిశ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్ ఆఫీస్ బేరర్ల సమావేశంలో గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. సుజిత్ గాంధీ ఇప్పటి వరకూ జాతీయ కార్యదర్శిగా కొనసాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36 రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు, అహ్మదాబాద్, చెన్నై మున్సిపల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీల్లో పని చేస్తున్న 21 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.