నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను తాజాగా పీసీసీ వెల్లడించింది. ఈ నలుగురు నాయకులు ఎప్పుడు ఎక్కడెక్కడ పాల్గొంటారో షెడ్యూల్‌ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జన జాతర సభతో పాటు 6 గంటలకు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరుకానున్నారు. ఈ నెల పదో తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌లో జన జాతర సభకు హాజరవుతారు. పదో తేదీన ఉదయం 10 గంటలకు పఠాన్ చెరు కార్నర్ మీటింగ్‌లో సాయంత్రం 4 గంటలకు మక్తల్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6 గంటలకు షాద్ నగర్ కార్నర్ సమావేశంలో ప్రియాంక గాంధీలతో కలిసి సభలో సీఎం పాల్గొంటారని వెల్లడించాయి. ఈ నెల 11 న ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ, కామారెడ్డి, తాండూర్‌ సభల్లో పాల్గొంటారని పేర్కొంది.

Spread the love