రాహుల్ గాంధీ కొండగట్టు సందర్శన వాయిదా..

నవతెలంగాణ – హైదరాబాద్:  రాహుల్ గాంధీ శుక్రవారం తెలంగాణలో చేపడుతున్న పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాహుల్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లాల్సి ఉండడంతో మార్పులు అనివార్యమయ్యాయి. సమయాభావం కారణంగా షెడ్యూల్‌లోని కొండగట్టు సందర్శన వాయిదాపడింది. అంతేకాదు సాయంత్రం నిజామాబాద్‌లో జరగాల్సిన పాదయాత్ర కూడా రద్దయ్యిందని పార్టీ వర్గాలు తెలిపారు. అయితే ముందుగా నిర్ణయించిన ఆర్మూర్‌లో పసుపు, చెరుకు రైతులతో రాహుల్ ముఖాముఖీ చర్చలో ఎలాంటి మార్పులేదు. రైతులతో భేటీ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. అది ముగిసిన తర్వాత హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తారని పార్టీ ప్రకటించింది.

Spread the love