బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన రాజారెడ్డి

నవతెలంగాణ- మోపాల్: మంగళవారం రోజున బాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో   కొండూరు గ్రామానికి చేందిన ఇల్తపు రాజారెడ్డి కాంగ్రెస్  నుండి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు రూరల్ ఎం ఎల్ ఏ బాజిరెడ్డి  గోవర్ధన్  కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గోవన్న నాయకత్వంలో తమ గ్రామ అభివృద్ధి చెందిందని, వచ్చే ఎన్నికల్లో తమ గ్రామంలో అత్యధిక ఓట్లు వేసి అధిక మెజార్టీతో గోవన్నని గెలిపించుకుంటామని,  ఆయన తెలిపారు. కార్యక్రమం లో గ్రామ బీఆర్‌ఎస్‌ యువ నాయకులు నర్మాల సుదర్శన్ రెడ్డి, రొండ్ల నరేందర్ రెడ్డి, చెల్లము లింబారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love