జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి రవీందర్ ఎంపిక..

– ఫిబ్రవరి 11న తిరుపతిలో ప్రధానం…
నవతెలంగాణ-బెజ్జంకి
డాక్టర్ రాధాకృష్ణ ఉత్తమ ఉపాధ్యాయ జాతీయ పురస్కారానికి మండల పరిధిలోని గుండారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయుడు రామంచ రవీందర్ ఎంపికైనట్టు సోమవారం బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్వహించనున్న దక్షిణ భారత బహుజన రచయితల సమావేశంలో రామంచ రవీందర్ కు డాక్టర్ రాధాకృష్ణ ఉత్తమ ఉపాధ్యాయ జాతీయ పురస్కారం ప్రధానం చేయనున్నట్టు నల్లా రాధాకృష్ణ తెలిపారు. జాతీయ పురస్కారానికి ఎంపికైన రామంచ రవీందర్ ను మండలంలోని ఉపాధ్యాయులు, పలువురు అభినందనలు తెలిపారు.
Spread the love