జాతీయ కవి సమ్మేళనంలో మేరెడ్డి రేఖకు స్వర్ణ కంకణ

నవతెలంగాణ – హైదరాబాద్: భవాని సాహిత్య వేదిక కరీంనగర్ వారి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన జాతీయ స్థాయి కవిసమ్మేళనంలో హైదరాబాద్ నగరానికి చెందిన మేరెడ్డి రేఖకు స్వర్ణకంకణం ప్రదానం చేశారు. ‘ఆమె` శీర్షికతో ఆమె వినిపించిన కవిత సభను అలరించింది. ఈ సందర్భంగా రేఖను తెలుగు భాష రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ, సాంస్కృతిక మండలి మాజీ అధ్యక్షులు గంటా జలంధర్ రెడ్డి ఘనంగా తోపాటు, మెమెంటో, శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా రేఖ మాట్లాడుతూ.. ఈ సన్మానం నాకు మరింత బాధ్యతను పెంచిందని, ఇంకా ముందు, ముందు ఈ సమాజంలో అసమానతలు పోవడానికి, స్త్రీ లను చైతన్యవంతం చేయడానికి కవిత్వం రాస్తానని అన్నారు.

Spread the love