– ఎన్నికల హడావుడిలో ఆటవిడుపు
– హెచ్సీయూలో పుట్బాల్ ఆడిన సీఎం రేవంత్
నవతెలంగాణ-మియాపూర్
కొద్దిరోజులుగా ఎన్నికల ప్రచారంతో బిజీబిజీగా గడిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఆదివారం ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి పుట్బాల్ ఆడారు. ప్రొఫెషనల్ పుట్బాల్ క్రీడాకారుడిగా గోల్ వేసేందుకు విద్యార్థులతో పోటీ పడ్డారు. ఆట మధ్యలో షూ పాడైపోతే షూ లేకుండానే ఆడారు. అంతకుముందు సీఎంకు విద్యార్థులకు స్వాగతం పలికారు. ఇరు జట్ల ఆటగాళ్లను సీఎం పరిచయం చేసుకున్నారు. సీఎంతోపాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, టీఎంఆర్ ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ, హెచ్సీయూ ఎన్ఎస్యూఐ యూనిట్, హెచ్సీయూ విద్యార్థులు పుట్బాల్ ఆడారు. ఈ పుట్బాల్ మ్యాచ్కి సీఎం సలహాదారు వేంనరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ ఏంఏ ఫహీం, టీ శాట్ సీఈఓ వేణుగోపాల్రెడ్డి, తదితరులు హాజరయ్యారు.