నలంద పాఠశాలలో ఘనంగా రిపబ్లిక్ డే సంబరాలు

నవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణంలోని మామిడిపల్లి లో గల నలంద హై స్కూల్లో  75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. వేడుక ఆధ్యాంతం చిన్నారుల ఆటపాటలతో ఆనందోత్సవాలతో సాగింది. పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్  మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారతదేశానికి ఇచ్చిన డాక్టర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని ప్రతి విద్యార్థిని విద్యార్థులు మహనీయుల బాటలో నడవాలని తెలియజేశారు పాఠశాల ప్రిన్సిపల్ సాగర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పదవ తరగతి విద్యార్థులు ఈ సంవత్సరం అద్భుత ఫలితాలు సాధించాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Spread the love