బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రేవంత్ రెడ్డి మండిపాటు

నవతెలంగాణ – హైదరాబాద్: నాగర్‌‌కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న గ్రామాల్లో బోనం ఎత్తితే, బతుకమ్మతో ఎదురొస్తే డబ్బులిస్తామని చాటింపు వేయడంపై తీవ్రంగా స్పందించారు. ‘‘బోనం ఎత్తడం ఆడబిడ్డల ఆత్మగౌరవం.. తెలంగాణ సంస్కృతికి సంకేతం. అలాంటి ఆత్మగౌరవానికి వెలకట్టడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి పరాకాష్ఠ. ఇది తెలంగాణ సంస్కృతి విధ్వంసం. బీఆర్ఎస్ పతనానికి సంకేతం” ట్వీట్ చేశారు.

Spread the love