నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరా? అనే ఉత్కంఠకు తెరపడింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని సీఎంగా అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం ఈ మేరకు రేవంత్ను సీఎంగా ఎంపిక చేసినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు.