ధాన్యం కొనుగోలుపై సమీక్ష..

నవతెలంగాణ-పెన్ పహాడ్
ముందస్తు సాగుతో గ్రామాల్లో ధాన్యం చేతికి అంది రావడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం తహసిల్దార్ మందడి మహేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులతో వరి పంట సాగు, దిగుబడి గురించి చర్చించి, డిమాండ్ మేరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కృష్ణ సందీప్, ఏపిఎం అజయ్, వ్యవసాయ విస్తరణ అధికారులు గోపి, మనోజ్, సంధ్య, రేణుక, సుష్మ, పిఎసిఎస్ సిఈఓలు సొమ్లా, సైదులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love