– దంపతులు మృతి
నవతెలంగాణ -టేకులపల్లి
ఎమ్మెల్సీ ఓటును వినియోగించుకుని తిరిగొస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం- ఇల్లందు ప్రధాన రహదారిలోని టేకులపల్లి మండల సమీపంలో సోమవారం జరిగింది. టేకులపల్లి ఎస్ఐ సైదా రాహుప్ తెలిసిన వివరాల ప్రకారం.. సంపత్ నగర్ గ్రామానికి చెందిన పాయం కృష్ణ(42), జానకి(40) దంపతులు ఎమ్మెల్సీ ఓటు వేసేందుకు గ్రామం నుంచి టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అక్కడ ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి బైక్పై వెళ్తుండగా కొత్తగూడెం నుంచి ఎదురుగా వస్తున్న కారు వీరి బైక్ను ఢకొీట్టింది. దాంతో దంపతులిద్దరికీ బలమైన గాయాలు కావడంతో కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు వారు మృతి చెందినట్టు తెలిపారు. దంపతులకు పాప ఉంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించి కుటుంబసభ్యులకు తమ సంతాపాన్ని తెలిపారు.