నవతెలంగాణ – హైదరాబాద్ : భారత కరెన్సీ రూపాయి విలువ సోమవారం చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.2 శాతం క్షీణించి 96.20 వద్ద ఆల్ టైమ్ స్థాయికి చేరింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీయడంతో ఈ భారీ పతనం నమోదైంది. గత శుక్రవారం తొలిసారిగా 96 మార్కును దాటిన రూపాయి, నేడు మరింత బలహీనపడింది. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
దీనికి తోడు ఇరాన్పై అమెరికా సైనిక చర్యలకు దిగవచ్చన్న సంకేతాలు కూడా ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో డాలర్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. రూపాయి రికార్డు స్థాయి పతనం దేశ స్థూల ఆర్థిక దృక్పథంపై ఆందోళనలను తీవ్రతరం చేస్తోంది. “ప్రస్తుత భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఇంధన ధరల ఒత్తిడి కారణంగా డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి 96 స్థాయిని దాటింది. దీనివల్ల దిగుమతుల బిల్లు, ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది” అని ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్ తెలిపారు.



