అజాద్‌ ఇంజనీరింగ్‌లో సచిన్‌ పెట్టుబడులు

హైదరాబాద్‌ : అజాద్‌ ఇంజనీరింగ్‌ సంస్థలో ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ ఎరోస్పేస్‌, డిఫెన్స్‌, క్లీన్‌ ఎనర్జీ, ఇంధనాలు, సహజవాయువు తదిత ర రంగాల సంస్థలకు పలు రకాల ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, విడిభాగాలు తయారీ చేసి అందిస్తోంది. సచిన్‌ తమ వాటాదారుడు కావటం ఎంతో సంతోషమని ఆజాద్‌ ఇంజనీరింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఛోప్దార్‌ పేర్కొన్నారు. ఈ సంస్థలో సచిన్‌ ఎంత పెట్టుబడి పెట్టారు. ఎంత వాటాను ఆయనకు ఇచ్చారనే వివరాలను ఆ కంపెనీ వెల్లడించలేదు.

Spread the love