ముగిసిన సాయిచంద్‌ అంత్యక్రియలు

నవతెలంగాణ  -హైదరాబాద్: సాయి చంద్‌కు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి. గుండెపోటుతో అర్ధరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. వనస్థలీపురం సాహెబ్‌నగర్‌ శ్మశాసనవాటికలో సాయిచంద్‌ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నేతలు, కళాకారులు హాజరై ఘన నివాళులర్పించారు.

Spread the love