సైఫుద్దీన్ భార్య‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం..

నవతెలంగాణ – జైపూర్: ముంబై రైల్లో కాల్పుల్లో మ‌ర‌ణించిన సైఫుద్దీన్ కుటుంబానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింది. సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పించింది. కులీకుతుబ్ షా ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. జియ‌గూడ‌లో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. వితంతు పెన్ష‌న్ కూడా మంజూరు చేసింది. సైఫుద్దీన్ ముగ్గురు కుమార్తెల‌కు బీఆర్ఎస్ త‌ర‌పున రూ. 2 ల‌క్ష‌ల చొప్పున‌, మ‌జ్లిస్ త‌ర‌పున రూ. 1 ల‌క్ష చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయ‌నున్నారు.

Spread the love