ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి మంత్రి వేముల శుభాకాంక్షలు

నవతెలంగాణ – కంటేశ్వర్
ఇటీవల ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా నియామకమైన ప్రొఫెసర్ లింబాద్రి ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మినిస్టర్ క్వార్టర్స్ లోని అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. ఈ సందర్బంగా ప్రొఫెసర్ లింబాద్రి మంత్రి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ లింబాద్రి మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ..ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Spread the love