- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం డోంగ్లి మండలంలోని మోగా గ్రామంలో ఆ గ్రామంలోని యుపిఎస్ పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రైవేటు చదువుల కంటే ప్రభుత్వ చదువులే ముద్దు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, ఇంటింటా ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు. పిల్లల తల్లిదండ్రులకు కలిసి గ్రామ పాఠశాలలో ప్రవేశం పొందే విధంగా అవగాహన కల్పించారు.
- Advertisement -



