అభివృద్ధిని చూసి ఓటు వేసి ఆశీర్వదించండి

నవతెలంగాణ- నసరుల్లాబాద్: బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బాన్సువాడ నియోజకవర్గ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నసురుల్లాబాద్, మండల పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్, ఎంపీపీ పాల్త్య విఠల్ లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు ఇతర రాష్ట్రాలను ఇలాంటి పథకాలు లేవని అన్నారు. బుదవారం సోమేశ్వర లో జరిగే యువ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమమును విజయవంతం చేయాలని యువకులను కోరారు. అలాగే గ్రామ నాయకులు కార్యకర్తలు గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. సీనియర్, జూనియర్ అనే భేదభావం లేకుండా అందర్నీ కలుపుకొని ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. గ్రామంలోని బూత్ లెవెల్ నాయకులు ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చి ఓటు వేయించేలా చూడాలని కోరారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పించారు అలాగే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్, జిల్లా కోఆప్షన్ నెంబర్ మాజీద్, మాజీ ఎంపిటిసి ఫోరం కన్వీనర్ కంది మల్లేష్ వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి నాయకులు యేడే మోహన్, ప్రతాప్ సింగ్, సాయిలు యాదవ్, ఖలీల్, నర్సింలుగౌడ్, మైసగౌడ్, భూమయ్య, హర్షద్, ఫయాజ్ సాయాగౌడ్ ,బాలమల్లు గౌడ్, భాను గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love