ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద చలివేంద్రాల ఏర్పాటు

నవతెలంగాణ -మహాముత్తారం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నర్సింగాపూర్‌ గ్రామంలో లక్కిరెడ్డి ప్రశాంత్‌ రెడ్డి అనే యువ నాయకుడు రైతుల దాహాన్ని తీర్చేందుకు నడుం బిగించాడు మంథని నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీ హర్షిని రాకేష్‌, ఎంపీటీసీ లక్కిరెడ్డి నరసింహారెడ్డిల ఆదేశాల మేరకు పీఏసీఎస్‌ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద శుక్రవారం చలివేంద్రాలను ఏర్పాటు చేశాడు. మండుతున్న ఎండలకు రైతులు కల్లాల వద్ద ఇబ్బందులు పడుతున్నారని వారి దాహం తీర్చేందుకే చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు లక్కిరెడ్డి ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు నాయకులు, అభిమానులు రైతులు పాల్గొన్నారు.

Spread the love