- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్ : తెలంగాణలో ఎండ వేడి రోజురోజుకు పెరిగిపోతుంది. తీవ్రమైన వడగాలుల నేపథ్యంలో IMD రాష్ట్రంలోని పలు జిల్లాలకు నేడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు ఉత్తర, మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44-46°C వరకు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అదే సమయంలో దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయంది. హైదరాబాద్లో కూడా రేపు, ఎల్లుండి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎండలు, అకస్మాత్తు వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Advertisement -



