కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీలో గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్ష్యంలో షర్మిల వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.. షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నారు. ఇక, షర్మిలకు ఏపీ బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వనున్నట్లు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్టీపీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తమ పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని షర్మిల ఆ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Spread the love