సంతానం కల్గడం లేదని మనోవేదనతో ఉరి వేసుకుని ఆత్మహత్య..

నవతెలంగాణ – జుక్కల్

 మండలంలోని మహమ్నదాబాద్ గ్రామములో ఓ వ్యక్తి సంతానం కల్గడం లేదని మనోవేదనకు గురై శనివారం నాడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిర్గపూరే బాల్ రాజ్ 36 సంవత్సరాలు మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సిర్గపూరే హన్మవ్వ ను హైద్రాబాద్ లో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కొన్నేండ్లుగా పిల్లలు కల్గడం వేదని గ్రామానికి వచ్చేసి ఇక్కడే స్థిర పడ్డారు. రాత్రీ బోజనం  చేసిన తరువాత బార్య  వేరే గదిలో  నిద్రిస్తున్న క్రమంలో ఇంట్లో  ఐరన్ రాడ్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బార్య హన్మవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమేాదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహన్ని పీఎమ్ కు పంపడం జర్గిందని జుక్కల్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
– ఫోటో:- మృతుడు బాల్ రాజ్ .
Spread the love