మంత్రి సహకారంతో శివాజీ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ

నవతెలంగాణ- కమ్మర్ పల్లి
బాల్కొండ మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో శివాజీ విగ్రహం ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ నిర్వహించినట్లు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని వన్నెల్ (బి) ఎక్స్ రోడ్డు వద్ద ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఏర్పాటుకు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తన స్వంత ఖర్చుతో రూ. లక్ష 20 వేల విలువ గల చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం  అందజేస్తున్నట్లు తెలిపారు.పెద్ద మనస్సుతో విగ్రహం ఏర్పాటుకు రూ.లక్ష 20వేలు వితరణగా ఇచ్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, సర్పంచి భూస సునీత నరహరి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పిప్పెరా అశోక్, అర్కరి గంగాధర్,   మాజీ సర్పంచి తౌటు గంగాధర్, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,యువజన విభాగం మండల అధ్యక్షుడు గాండ్ల రాజేష్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, సొసైటీ వైస్ చైర్మన్ వేంపల్లి పెద్ద బాల్ రాజేశ్వర్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేంపల్లి చిన్న బాల్ రాజేశ్వర్, సొసైటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ గౌడ్, వార్డు సభ్యులు తోపారం అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love