బోధన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా షేక్ జలీల్ 

నవతెలంగాణ-నవీపేట్: బోధన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నవీపేట్ కు చెందిన షేక్ జలీల్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎంపీటీసీగా పోటీ చేసిన షేక్ జలీల్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. బోధన్ ప్రజల ఆశీర్వాదంతో ఇండిపెండెంట్ గా గెలిచి సేవ చేస్తానని అందరు సహకరించాలని కోరారు.
Spread the love