బాధ్యతలు స్వీకరించిన మంత్రి శ్రీదర్ బాబు

నవతెలంగాణ-మల్హర్ రావు : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మంథని నియోజకవర్గం నుంచి ఐదోవసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ, ఖర్గే,సీఎం రేవంత్ రెడ్డి లు దుద్దిళ్లకు రాష్ట్ర పరిశ్రమ,ఐటి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించడంతో గురువారం ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు.వేదపండితులచే మంత్రోత్సరణలు చేసి దుద్దిళ్లకు ఆశీర్వచనాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయెస్ రంజన్, కృష్ణ భాస్కర్,దుద్దిళ్ల కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love