వేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.2.50 లక్షల వెండి బహుకరణ 

నవతెలంగాణ-మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్లలోని వేంకటేశ్వర స్వామి,అమ్మవార్ల  ఆలయానికి రూ.2.50 లక్షల విలువగల వెండి ఆభరణాలను వోల్లాల నవ్య సత్యనారాయణ దపతులు బహుకరించారు. అలాగే వేంకటేశ్వర ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love