బెల్ట్ షాప్ లో మద్యం పట్టుకున్న ఒకటవ టౌన్ పోలీసులు

నవతెలంగాణ కంటేశ్వర్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం శ్రీరామనామిని పురస్కరించుకొని మద్యం షాపులు బంధువుంచాలని తెలుపగా నగరంలోని ఒకటో పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్చి కాంపౌండ్ లో మద్యం అమ్ముతుండగా పట్టుకున్నట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు బుధవారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ విజయ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్చి కాంపౌండ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాపు నడుపుతున్న సయ్యద్ బషీర్ అలియాస్ ఆజ్జా ను అరెస్టు చేసి అతని వద్ద గల 157 గుడ్ డే క్వాటర్లు 8 బీర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలియజేశారు. ఇలా ఈ ఒకసారి కాకుండా నిజాంబాద్ లో ఎన్నో బెల్టు షాపులలో ఈరోజు ఈ తతంగం జరిగింది. ఎక్కడ చూసినా రోడ్లపై మద్యం ప్రియులు మద్యం కోసం విచ్చలవిడిగా బెల్ట్ షాప్ లో చుట్టూ తిరుగుతూ మద్యం తాగుతూ తుల్లుతూ ఉన్నారు. నిజామాబాదులో విచ్చలవిడిగా గల్లీకి సుమారు ఐదు ఆరు చొప్పున బెల్ట్ షాప్ లో ఉన్నాయి. దీనిని నివారించడంలో ఒకవైపు ఎక్సైజ్ శాఖ, మరోవైపు పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ తోపాటు పోలీస్ శాఖ సైతం సహకరిస్తూ వారి వద్ద మామూలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Spread the love